Tuesday, May 14, 2024

ఒడిశా రైలు బాధితులకు రూ.10కోట్లు విరాళంగా ఇస్తా

- Advertisement -
- Advertisement -

ఒడిశా రైలు బాధితులకు రూ.10కోట్లు విరాళంగా ఇస్తా
కేంద్ర రైల్వే మంత్రికి ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ మేరకు అభ్యర్థన పంపించారు. ప్రమాద బాధితుల కోసం తాను పంపించిన 10 కోట్లను స్వీకరించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత నిధి నుండి చట్టబద్ధమైన సంపాదన నుండి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధులు ఉపయోగించవచ్చని ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు. రైలు ప్రమాద ఘటనను దురదృష్టకర దుర్ఘటనగా పేర్కొన్న ఆయన ఈ విషాదం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, ఈ ప్రమాద ఘటనలో బాధితుల కోసం తాను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని అందజేస్తున్న కారణంగా బాధ్యతాయుతమైన మంచి పౌరుడిగా ఈ సాయం చేస్తున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News