దుబాయ్: ఐపిఎల్ -13వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నైసూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. దీనిలో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తున్నామని, తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వార్నర్ తెలిపాడు. మరోవైపు చెన్నై టీమ్లో మూడు మార్పులు చేసినట్లు ధోనీ వెల్లడించాడు. మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, హేజిల్వుడ్ స్థానంలో అంబటి రాయుడు, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావోలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మహీ పేర్కొన్నాడు.
హైదరాబాద్ జట్టు
డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఖలీల్ అహ్మద్.
చెన్నై జట్టు
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, కేదార్ జాదవ్, ధోనీ(కెప్టెన్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా.
David Warner wins the toss and elects to bat first against #CSK in Match 14 of #Dream11IPL.#CSKvSRH pic.twitter.com/s0NeQCRJ37
— IndianPremierLeague (@IPL) October 2, 2020