Thursday, May 2, 2024

పాలేరు బరిలో తమ్మినేని

- Advertisement -
- Advertisement -

బిజెపిని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వం : తమ్మినేని

14 మంది అభ్యర్థుల ప్రకటన

మరో మూడు స్థానాలు త్వరలో ప్రకటన

ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి.సాగర్, ఎండి అబ్బాస్‌తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

జర్నలిస్టుల సంక్షేమానికి తగిన విధంగా కృషి చేస్తామనీ, వారి ప్రయోజనాలు కాపాడే విధంగా పోరాడుతామని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్లు వివరించారు. మూడు నినాదాలతో సిపిఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు పోతుందని చెప్పారు. మొదటిది సిపిఎం అసెండ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వం డీ అని అడుగుతామన్నారు. అలా ప్రాతినిధ్యం ఇస్తే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు, విద్యార్థులు, యువకులు, దళితులు, గిరిజనులు వంటి సామాన్యుల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడుతుందన్నారు. భవిష్యత్ పోరాటాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గతంలో శాసనసభలో, పార్లమెంట్‌లో కమ్యూనిస్తులు నిర్వహించిన పాత్రకు ఘనమైన చరిత్ర ఉందని వివరించారు.

కమ్యూనిస్టులు బలంగా చట్టసభల్లో ఉన్న కాలంలోనే ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టాలొచ్చాయన్నారు. ఆర్థిక సంస్కరణల్లో ప్రయివేటీకరణకు పెద్ద పీట వేయకుండా అడ్డుకట్ట వేసింది కమ్యూనిస్టులేనన్నారు. ఎల్‌ఐసి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగుల్ని, కార్మికులను కాపాడే పోరాటాలు నిర్వహించామన్నారు. ఈ రకంగా కమ్యూనిస్టుల పోరాట చరిత్ర మరవలేనిదన్నారు. ఆ పోరాట చరిత్రను తెలంగాణ ప్రజలు మననం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేపథ్యంలోనే రాబోయే కాలంలో శాసనసఢలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ప్రజల ముందుకు పోతున్నామని చెప్పారు. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేశారు.

వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సిపిఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సిపిఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదని స్పష్టం చేశారు. వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక, సామాజిక, పోరాడే శక్తులు, ప్రజలకు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్లతో కలిసి పొత్తులు, సర్దుబాట్లు చేసుకోవటానికి కృషి చేస్తామని చెప్పారు. మూడోది. బిజెపి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నదనీ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదనీ, నియంతృత్వ చట్టాలను తీసుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కుబేరులకు కట్టబెడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీని గద్దెదించటం అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బిజెపి బలపడటానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఆ పార్టీ చెప్పినట్లు అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేకపోయినప్పటికీ గెలవగలిగే రెండు, మూడు స్థానాల్లోనైనా ఆ పార్టీని గెలవకుండా చేయటమే లక్షంగా పనిచేస్తామని చెప్పారు. బిజెపి భావాజాలాన్ని ప్రజల మనసుల్లోనుంచి తొలగించేందుకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదు…
పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. వారు ఇస్తామన్న సీటు కూడా ఇవ్వకుండా దాట వేస్తున్నారన్నారు. ఒక్కో సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎంఎల్‌సి ఇస్తామనీ చెప్పినట్లుగా సిపిఐ ద్వారా తెలిసిందన్నారు. పెద్దలు జానారెడ్డి కూడా ఫోన్ చేశారన్నారు. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలోకి పోయేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
సిపిఎం అభ్యర్థులు వీరే…
భద్రాచలం కారం పుల్లయ్య, అశ్వారావుపేటపిట్టల అర్జున్, పాలేరుతమ్మినేని వీరభద్రం, మధిరపాలడుగు భాస్కర్, వైరా భూక్యా వీరభద్రం, ఖమ్మం ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిమాచర్ల భారతి, మిర్యాలగూడజూలకంటి రంగారెడ్డి, నకిరికల్‌భజ్జ చిన్న వెంకులు, భువనగిరికొండమడుగు నర్సింహ్మా, జనగాంమోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంపగడాల యాదయ్య, పఠాన్‌చెరుజె.మల్లికార్జున్, ముషీరాబాద్‌ఎం.దశరథ్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News