Sunday, April 28, 2024

రోహిత్ శర్మ ఔట్… టీమిండియా 94/3

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 27 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 39 పరుగులు చేసి టామ్ హార్ట్ లే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. భారత్ బ్యాట్స్ మెన్లలో యశస్వి జైస్వాల్(15), శుభమన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(20), అక్షర పటేల్(17) బ్యాటింగ్ చేస్తున్నారు. టామ్ హార్ట్ లే మూడు వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు. టీమిండియా ఇంకా 138 పరుగులు చేస్తే విజయం సాధించినట్టే. ఇంగ్లాండ్ ఏడు వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 246

భారత్ తొలి ఇన్నింగ్స్: 436

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 420

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News