Sunday, April 28, 2024

తెలంగాణ పల్లెలు గాంధీ కలలకు ప్రతి రూపాలు

- Advertisement -
- Advertisement -

గాంధీ జయంతి సందేశంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా గాంధీ 154వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గాంధీజీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని సిఎం తెలిపారు.

వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో , ఆసరానందుకుంటున్న పేదల, పెద్దల చిరునవ్వులతో…. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని సిఎం కెసిఆర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News