Sunday, April 28, 2024

పన్ను రాయితీలో మార్పు ఉండదు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను విషయంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. నివేదిక ప్రకారం, ఈ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలో పెరుగుదల ఉండదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ ఈ విషయాన్ని చెప్పింది.

కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీ పరిధిని పెంచవచ్చని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిధి రూ.7 లక్షలు ఉంది. సంవత్సరానికి రూ.7.5 లక్షలకు పెంచాలని భావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది బడ్జెట్(2023)లో ఈ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News