Thursday, May 9, 2024

నేడే భేటీ

- Advertisement -
- Advertisement -

 KCR

 

ప్రగతిభవన్‌లో ఉ.11గం.కు తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సమావేశం

ఇంకా మిగిలిన విభజన సమస్యలపై దృష్టి, గోదావరి నీళ్ల
మళ్లింపు, ఎపి మూడు రాజధానుల వివాదం చర్చకు వచ్చే అవకాశం

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్‌జగన్ నేడు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో సోమవారం ఉదయం 11గం. కు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. దాదా పు నాలుగు నెలల విరామం తర్వాత జరుగుతున్న తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పట్ల అంతటా ఆసక్తి నెలకొన్నది. రాష్ట్ర విభజన చట్టంలోని మిగిలిన సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రులు దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది. చర్చల్లో వి ద్యుత్ ఉద్యోగుల విభజన శ్రీశైలానికి గోదావరి నీళ్ల తరలింపు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నట్లు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన కార్యాచరణ పైనా చర్చించే అవకాశం ఉన్నది. వివాదాస్పదంగా మారిన ఎపి మూడు రాజధానుల సమస్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ విషయంపై కెసిఆర్ సూచనలు, సలహాలను జగన్ తీసుకోనున్నట్టు భావిస్తున్నారు.

Today KCR and Jagan meeting
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News