హైదరాబాద్ : నగరంలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఇన్స్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది ఇన్స్స్పెక్టర్లను పోలీస్ కమిషనర్ బదిలీ చేశారు. ఇందులో ఈస్ట్ జోన్లో అటాచ్డ్లో ఉన్న సత్తయ్యను జూబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్గా, ఫలక్నూమ ఎస్హెచ్ఓ శ్రీనివాస్రావును ట్రాఫిక్కు, పంజాగుట్ట ఇన్స్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డిని మేయిన్ పిసిఆర్కు, ట్రాఫిక్ బ్రాంచ్ సాయిఈశ్వర్ గౌడ్ను గోపాల్పురం ఎస్హెచ్గా, గోపాలపురం ఎస్హెచ్ నిరంజన్ రెడ్డిని పంజాగుట్ట ఎస్హెచ్ఓగా, సిఎస్డబ్లూలో పనిచేస్తున్న చంద్రకుమార్ను ఫలక్నూమ ఎస్హెచ్ఓగా, వేయిటింగ్లో ఉన్న ఇన్స్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ను అసెంబ్లీ సెక్యూరిటీగా, చాంద్రాయణగుట్ట పిఎస్ అటాచ్డ్గా ఉన్న ఇన్స్స్పెక్టర్ కెఎన్ ప్రసాద్ వర్మను సిసిఎస్కు అటాచ్డ్ చేశారు.