- Advertisement -
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ మాట మార్చారు. భారత్, పాకిస్థాన్ల తెలివైన నేతలే తమ మధ్య ఘర్షణను నిలిపివేసుకున్నారని చెప్పారు. ఇది జరగకపోయి ఉంటే , అణుయుద్ధానికి దారితీసేదని వెల్లడించారు. తన జోక్యం, కొంచెం బెదిరింపులతోనే పా క్, భారత్లు శాంతి బాట పట్టాయని పదేపదే ట్రంప్ చెబుతూ వచ్చారు. అణ్వాయుధ యు ద్ధం నిలిపివేసిన ఘపత తన ఖాతాలోకే వస్తుందంటూ చెప్పుకొచ్చారు. అయితే కాల్పుల విరమణలో త న ప్రమేయం ఏమీ లేదని ఇప్పుడు అంగీకరించా రు. అమెరికాకు వచ్చిన పాక్ సైనికాధికారి ఫీల్డ్ మార్షల్ అసి మ్ మునీర్కు అరుదైన రీతి లో ఇచ్చిన విందు సందర్భంగా వైట్హౌస్లో ట్రంప్ మీడియా తో మాట్లాడారు. ప్రమాదకర యుద్ధం నిలిపివేత దిశలో వెళ్లిన భారత్, పాక్ దేశాల నేతలను ఆ యన ప్రశంసించారు.
- Advertisement -