Tuesday, June 24, 2025

నేడు రైతు నేస్తం

- Advertisement -
- Advertisement -

సచివాలయం ఎదుట సాయంత్రం ఆరుగంటలకు వేడుక
హాజరుకానున్న సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు
గ్రామాల్లోనూ రైతు నేస్తం నిర్వహణకు పిలుపు ఇచ్చిన మాట
ప్రకారం 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేశాం
ఈ ఘనత సిఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుంది: మంత్రి తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో- సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తున్నట్లు వ్యవసాయశాఖ – మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ. 8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించా రు. సోమవారం సచివాలయం ఎదురుగా ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం జరుగనున్న రైతు నేస్తం వేడుక ఏర్పాట్లను రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారా వు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులతో కలిసి మంత్రి తు మ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మీడియాతో మాట్లాడుతూ ఎకరాల తో సంబంధం లేకుండా సాగులో ఉన్న మి గతా భూములకు రైతుభరోసా నిధుల ప్ర క్రియను మంగళవారం వరకు పూర్తి చేస్తామని ప్రకటించారు.

జూన్ 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన రైతుభరోసా ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం రైతుభరోసా ప్రక్రియను పూర్తి చేసి, రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని మంత్రి తుమ్మల వివరించారు.రైతుభరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకా రం తొమ్మిది రోజుల్లో పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర
సచివాలయం ఎదురుగా ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతుపండగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ రైతుపండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పెద్దఎత్తున పాల్గొని రైతుపండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

వరుసగా నిధుల విడుదల
రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా మొదటి రోజు రెండు ఎకరాల వరకు రూ.2,349.83 కోట్లు, రెండవ రోజు మూడు ఎకరాల వరకు రూ.3,901.73 కోట్లు, మూడవ రోజు నాలుగు ఎకరాల వరకు రూ.5,215.26 కోట్లు, నాలుగో రోజు ఐదు ఎకరాల వరకు రూ.6,404.70 కోట్లు, ఐదవ రోజు ఏడు ఎకరాల వరకు రూ.7,310.59 కోట్లు, ఆరవ రోజు తొమ్మిది ఎకరాల వరకు రూ.7,770.83 కోట్లు, ఏడవ రోజు పదిహేను ఎకరాల వరకు రూ.8,284.66 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వివరించారు. ఇంత తక్కువ రోజుల్లోనే రైతుభరోసా నిధుల రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారని తెలిపారు.

రైతుల్లో ఆనందం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నప్పటికీ రైతు సంక్షేమంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేసిన ఘతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఇంతకు ముందు రెండు నుంచి నాలుగు నెలల సమయం పట్టేదని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసి రైతు కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపామని చెప్పారు.

పద్రాగస్టులోగా రుణమాఫీ చేశాం
తాము మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కూడా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీ లోగా పూర్తి చేశామని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. దేశంలో ఇతర ఏఒక్క రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నాలకు మద్ధతు ధరపై రూ.500 బోనస్ ప్రకటించామని, తద్వారా అదనంగా 2 వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా, చేయకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండిన ప్రతి పంటను సేకరిస్తుందన్నారు. తమది ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని తమ ప్రభుత్వం ఆచరణలో రుజువు చేసిందన్నారు. రైతు భరోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వాడుకొని, మంచి పంటలు పండించుకోవాలని మంత్రిసూచించారు.

దురుద్దేశ్యంతోనే విమర్శలు
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని కానీ, ఇవేమీ కనబడని ప్రతిపక్ష నాయకులు దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి తుమ్మల విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గుర్తించి విమర్శలు మానుకోవాలని మంత్రి తుమ్మల వివపక్షాలకు సూచించారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యత అని, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తామందరం కలిసి పనిచేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News