Friday, April 26, 2024

పెట్రోల్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

వనపర్తి: జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఓ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలో చిన్నంబావి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బడికల జయన్న(40), భార్య వరలక్ష్మీ, కూతురు గాయత్రి ముగ్గురు కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 10 గంటలకు తమ ఇంట్లో పెట్రోల్‌ ఒంటిపై పోసుకొని నిప్పంట్టించుకున్నారు.దీనిని గమనించిన స్థానికులు మంటలను ఆర్పి, అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి శరీరం ఎక్కువ భాగం కాలిపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో వారిని మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తండ్రి జయన్న, కూతురు మరణించారు. జయన్న భార్య పరిస్థితి కూడా విసమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలను సేకరించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Two dead after family suicide attempt in House

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News