న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలో ఉద్యోగ్ నగర్ లో పీరగర్హి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఫ్యాక్టరీలో దట్టంగా పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ భవనం నేల కూలింది. దీంతో భవనంలో ఉన్నవారితోపాటు ఫైర్ సిబ్బంది కొంతమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో 35 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తీవ్రంగా గాయపడిన పదమూడు మంది ఫైర్ సిబ్బందితోపాటు మరోకరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది. కాగా, కొద్ది రోజుల వ్యవధిలోనే ఢిల్లీ నగరంలో పలు అగ్రిమాదాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
I hope and pray that no life is lost. #udyogvihar #industrial #peeragarhi #fire pic.twitter.com/JDOBmdTpk7
— Mehar Bhagat (@MeharBhagat) January 2, 2020
Fire broke out at Peeragarhi in Delhi