- Advertisement -
శ్రీనగర్: శనివారం జమ్మూకాశ్మీర్లోని నౌషెరాసుందర్బనీ సెక్టార్లో మందుపాతర పేలిన ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఒకరు సైనికాధికారి కాగా, మరొకరు సాధారణ సైనికుడు. వాస్తవాధీనరేఖ(ఎల్ఒసి) ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడకుండా ఆ ప్రాంతంలో మందుపాతరల్ని సైన్యమే అమర్చింది. వాటిని గుర్తించకుండా వెళ్లడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
- Advertisement -