Monday, May 13, 2024

ఉమామహేశ్వరిది ఆత్మహత్యే

- Advertisement -
- Advertisement -

Umamaheswari committed suicide:Forensic doctor

జూబ్లీహిల్స్ పోలీసులకు చేరిన పోస్టుమార్టం నివేదిక

మనతెలంగాణ, హైదరాబాద్ : దివంగత నేత ఎన్‌టిఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం నివేదిక ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ సైన్స్ వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం అందజేశారు. ఈ నెల 1వ తేదీన ఉమామహేశ్వరి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మాని ఆస్పత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు మహేశ్వరి మెడ భాగంలోత్రోట్ స్వరపేటిక బ్రేక్ అవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమర్టం నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు నివేదికను పోలీసులకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News