- Advertisement -
లక్షణాలు లేవు, హోం
ఐసోలేషన్లోఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(71) కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్ చేసింది. అయితే, వెంకయ్యనాయుడుకు లక్షణాలులేవని(అసింప్టమేటిక్), ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. వైద్యులు నాయుడిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారని తెలిపింది. ఆయన భార్య ఉషా నాయుడికి కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని, ఆమె సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొన్నది.
- Advertisement -