Thursday, April 25, 2024

విరాట్ ఔట్… టీమిండియా 73/3

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ 13 పరుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి ఎల్‌బిడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. శుభమన్ గిల్ ఐదు పరుగులు చేసి లయాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వరా పుజారా(20), రవీంద్ర జడేజా (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా 15 పరుగుల ఆధిక్యంలో ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్: 109
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 197

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News