Thursday, May 2, 2024

ముగిసిన ఈటల విచారణ

- Advertisement -
- Advertisement -

వరంగల్ : తనకు ప్రశాంత్ నుండి టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సాప్‌లో రాలేదని పోలీసులు గుర్తించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసుకు సంబంధించి సోమవారం పోలీసులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ నుండి తనకు హిందీ పేపర్ వాట్సాప్ చేశారని పోలీసులు ఆరోపించారన్నారు. సోమవారం పోలీసుల విచారణకు తాను తన మొబైల్ తో సహా వెళ్లినట్టుగా చెప్పారు. తన ఫోన్‌ను పోలీసులు పరిశీలించారన్నారు. తనకు ప్రశాంత్ నుండి ఎలాంటి ఫోన్ కానీ, ప్రశ్నాపత్రం కూడా రాలేదని పోలీసులు నిర్ధారించారన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మహేష్ యాదవ్ అనే వ్యక్తి ప్రశ్నాపత్రం స్క్రీన్ షాట్ ను తనకు పంపాడని చెప్పారు.

కానీ తాను ఈ వాట్సాప్‌ను చూడలేదని పోలీసులు గుర్తించినట్టుగా తెలిపారు. ఈ పేపర్ ను తాను ఎవరికి కూడా షేర్ చేయలేదని పోలీసులు గుర్తించారని వివరించారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా స్రజా జీవితంలో ఉన్న తాను వరంగల్ పోలీసుల విచారణకు హాజరైనట్టుగా చెప్పారు. తన సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నార న్నారు. ఇది పేపర్ లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని అభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. ప్రశాంత్ తెలుసా? ప్రశాంత్ ఎప్పుడైనా ఫోన్ చేశాడా? ప్రశాంత్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావా? అని పోలీసులు తనను అడిగారని చెప్పారు. ఈ నెల 4వ తేదీన టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది .

పలువురు పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులకు ఈ పేపర్ వాట్సాప్ లో షేర్ చేశారు. ఈ కేసులో ప్రశాంత్ ను పోలీసులు అరెస్ చేశారు. ఈ కేసులో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈ నెల 4వ తేదీ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ నుండి బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు కూడా టెన్త్ క్లాస్ హిందీ పేపర్ షేర్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ విషయమై ఈటల రాజేందర్‌కు నాలుగు రోజుల క్రితం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసుల నోటీసులు తీసుకన్న ఆయన సోమవారం వరంగల్ డిసిపి ముందు విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News