న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని ట్రంప్ గుర్తుచేశారు. సరిహద్దు సమస్య గురించి ప్రధాని మోడీతో సంభాషించినట్టు ట్రంప్ చెప్పారు. చైనా తీరు పట్ల మోడీ అసంతృప్తిగా ఉన్నారని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్- మోడీ మధ్య అలాంటి సంభాషణేదీ జరగలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 20న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంపై మాత్రమే చర్చించారిని విదేశాంగశాఖ తెలిపింది. ట్రంప్ ట్వీట్ పై భారత్ ఇప్పటికే అత్యంత సున్నితంగా సమాధానమిచ్చింది.
#WATCH "We have a big conflict going on between India & China, 2 countries with 1.4 billion people & very powerful militaries. India is not happy & probably China is not happy, I did speak to PM Modi, he is not in a good mood about what's going on with China": US President Trump pic.twitter.com/1Juu3J2IQK
— ANI (@ANI) May 28, 2020