Saturday, April 27, 2024

ఫోన్ తెచ్చిన తంటా… భర్త మందలింపు… భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఫోన్ లో పదే పదే మాట్లాడుతున్నావని భార్యను భర్త మందలించినందుకు ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాణి (28), వెంకటేష్ (32) అనే దంపతులు దుండిగల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాణికి వెంకటేష్ రెండు, మూడు సార్లు ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ రావడంతో అనుమానపడ్డాడు. ఇతరులతో ఫోన్ మాట్లాడవద్దని భార్యను వెంకటేష్ హెచ్చరించాడు. దీంతో మనస్థాపం చెందిన వాణి ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Wife commit Suicide with Phone Issue in Medchal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News