Thursday, May 2, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను సిఐఎస్ఎస్ అధికారులు కాపాడారు. బాధితురాలిని బెంగళూరుకు చెందిన శ్వేతగా గుర్తించారు. విమానాశ్రయంలో రెండో అంతస్తు నుంచి మహిళ దూకేందుకు యత్నించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News