Friday, September 19, 2025

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పేకాట ఆడుతూ కొందరు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లాలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి నాలుగో అంతస్థులో డబ్బులు పెట్టి మహిళలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘనాస్థలంపై దాడి చేసి నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News