Tuesday, April 30, 2024

ఎన్‌టిఆర్‌ను మింగేసిన అనకొండ చంద్రబాబు…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను మింగేసిన అనకొండ చంద్రబాబు నాయుడు అని వైసిపి నేత జ్యోతుల చంటిబాబు విమర్శించారు. చంటి బాబు మీడియాతో మాట్లాడారు. తన ఆస్తులపై చర్చకు సిద్ధమా?.. చంద్రబాబు ఆస్తులకు ఆయన సిద్ధంగా ఉన్నారా? అని సవాలు విసిరారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి చాలా మంది నాశనమైపోయారని విమర్శించారు. బాబును నమ్మి బొడ్డు భాస్కర్ రామారావు కృంగి చనిపోయాడని చంటిబాబు మండిపడ్డారు. జ్యోతుల నెహ్రును జగ్గంపేట నుంచి నిలబెట్టే దమ్ముందా? అని బాబును ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News