కోల్కతా: టిక్టాక్ మోజులోపడి ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్లోని మల్దా ప్రాంతంలో జరిగింది. ఓ యవకుడు కరెంట్ స్తంభానికి కట్టేసుకొని ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టుకొని టిక్టాక్ వీడియో తీస్తుండగా చనిపోయాడు. ఇద్దరు మైనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఫిరగంజ్ ప్రాంతంలో కరీమ్ షేక్ (17) అనే యువకుడు డేంజరస్ స్టంట్ చేసి టిక్టాక్లో వీడియోలు ఆప్లోడ్ చేసేవాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి టిక్ టాక్ వీడియోలు తయారు చేసేవాడు. కరెంట్ పోల్కు కరీమ్ కట్టేసుకొని అనంతరం ముఖానికి కవర్ చుట్టుకున్నాడు. అప్పుడే అతడి స్నేహితులు వీడియో షూటింగ్ చేశారు. పది నిమిషాల తరువాత అతడు కుప్పకూలిపోవడంతో దగ్గరికి వెళ్లి చూశారు. స్పృహ లేకపోవడంతో అక్కడి నుంచి స్నేహితులు పారిపోయారు. వెంటనే స్థానికులు కరీమ్ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కరీమ్ చనిపోయాడని తెలిపారు. శ్వాస ఆడకపోవడంతోనే కరీమ్ మృతి చెందాడని వెల్లడించారు. కరీమ్ బాబాయ్ రబియల్ ఇస్లామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీమ్ స్నేహితులు ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నారని స్థానిక ఎస్పి అలోక్ రజోరియా తెలిపారు.