శేరిలింగంపల్లి: కాలేజీకి వెళ్తున్న అని ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిషాల్ సోనీ (18) జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ లో నివాసముంటూ కూకట్ పల్లి లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతుంది. రెండు రోజుల క్రితం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీ లో ఉంటున్న తన అన్న జైరామ్ ఇంటికి వెళ్లింది. కాగా ఈ నెల 27 న ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు బిషాల్ సోని చదువుతున్న కాలేజీకి వెళ్లి విచారించారు. తాను కాలేజీకి రాలేదని, అసలు కాలేజీ మూసి ఉందని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. తర్వాత కుటుంబీకులు బంధువులు, తెలిసిన అన్ని ప్రాంతాలలో ఆమె ఆచూకీ కోసం వెతికిన ఫలితం లేకపోయింది. దీంతో వారు చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Young Woman Missing in Chandanagar Hyderabad