Sunday, April 28, 2024

ఏ క్షణమైనా ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Term of office of 6 MLCs in Governor's quota ends

 

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. శాసనమండలిలో ఎంఎల్‌ఎ కోటాలో ఆరుగురు ఎంఎల్‌సిల పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుండగా, గవర్నర్ కోటాలో మరో ఎంఎల్‌సి పదవీ కాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంఎల్‌ఎ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు ఎంఎల్‌సిలుగా కొనసాగుతుండగా, గవర్నర్ కోటా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఎంఎల్‌సిగా కొనసాగుతున్నారు. ఈ ఎంఎల్‌సి స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది.

Term of office of 6 MLCs in Governor’s quota ends on June 16
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News