Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్రలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ ప్రా రంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నాయకులు హరీశ్‌రావులు దుయ్యబట్టారు. పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీ ఇంఛార్జీలతో వారు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత పది సంవత్సరాలలో లక్షలాది మందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న, ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోలని వెల్లడించా రు.ప్రభుత్వకార్యక్రమాలతో పాటుగత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వం టి ప్రజా ప్రయోజన మౌలిక వసతుల ను సైతం రద్దు చేస్తున్నదని, ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎం పిక పూర్తి అయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే లబ్ధిదారులు ప్రభు త్వం అందించిన అధికారిక పత్రాలు ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాదిమంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని, బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని తప్పు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డిడి లు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలని, దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని, ఎన్నికల్లో దళిత బంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు దళిత బంధు ప్రకారం 10 లక్షలైనా ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 12 లక్షల రూపాయలైనా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. దళిత బందుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. ఒకవైపు పేదలకు ఉపయుక్తంగా ఉండే గృహలక్ష్మిని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బడుగు బలహీన వర్గాల తో పాటు దళిత సమాజానికి అండగా నిలబడిన గొర్రెల పంపిణీ, దళిత బందు కార్యక్రమాన్ని రద్దు చేయడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపైన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను పార్టీ తరఫున చేపడుతా మన్నారు. లబ్ధిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయ డం కాకుండా గత ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని, మునిసిపాలిటీలకు టి యు ఎఫ్ ఐ డి సి, ఇతర సంస్థల ద్వారా శాఖ ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును రద్దు చేస్తున్నదన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్ల మంజూరు ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ వెళుతున్న తీరు పైన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు మాజీ ఎంఎల్‌ఎలకు కేటీఆర్, హరీష్ సూచించారు.

Harish Rao

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News