భోపాల్: ఆన్లైన్ గేమ్ ప్రతి సారి ఓడిపోవడంతో పదేళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు రాళ్లతో కొట్టిన చంపిన సంఘటన మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాసుదియా ప్రాంతంలోని ఐడిఎ భవనం సమీపంలో నివసించే దేవికకు ఓ స్నేహితుడు ఉన్నాడు. ప్రతి రోజు బాలుడు, బాలిక కలిసి ఆన్లైన్లో ఆటలు ఆడేవారు. ఆన్లైన్ గేమ్ లో బాలుడు ప్రతిసారి ఓడిపోవడంతో అసూయ పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రిత బాలుడు పెంచుకుంటున్న ఎలుకను బాలిక చంపేయడంతో కక్ష పెట్టుకున్నాడు. ఆన్లైన్ గేమ్లో ఓడిపోవడంతో ఆమెను రాళ్లతో కొట్టి తన ఇంటికి వెళ్లి బాత్రూమ్లోకి వెళ్లి లోపల నుంచి లాక్ చేసి దాక్కున్నాడు. బాలిక రక్తపు మడుగులో కనిపించడంతో చనిపోయినట్టు స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా బాలిక ఓ బాలుడితో ఆడుకుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో బాలుడి ఇంటికి పోలీసులు వెళ్లారు. బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కౌన్సిలింగ్ ఇచ్చి అతడిని బయటకు రప్పించారు. జరగిన విషయం మొత్తం పోలీసులకు బాలుడు చెప్పడంతో అవాక్కయ్యారు. బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఆన్లైన్ గేమ్లతో అప్రమత్తంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ఫోన్ పిల్లల చేతికి ఇచ్చినప్పుడు ఓ కంట కనిపెడుతు ఉండాలని పోలీసులు తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఆన్లైన్ గేమ్… 10 ఏళ్ల బాలిక ప్రాణం తీసిన బాలుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -