- Advertisement -
చండీగఢ్: హర్యానాలోని రేవరీ జైలు నుంచి 13మంది ఖైదీలు పారిపోయారు. శనివారం అర్ధరాత్రి వేళ ఖైదీలు జైలు ప్రహరీ గోడలు దూకి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. పారిపోయినవారిలో హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన నిందితులున్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవలే ఆ జైలులో ఖైదీలలోని కొవిడ్19 పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని పలు జైళ్లలోని కొవిడ్ సోకిన ఖైదీలను అక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జైలులోని బ్యారక్ ఇనుప గ్రిల్ను కట్ చేసి బయటకు వచ్చారని, దుప్పట్లను తాడుగా ఉపయోగించి జైలు గోడలు దూకి పరారైనట్టు చెబుతున్నారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -