Sunday, April 28, 2024

రెండు లక్షల 35 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1504 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 35 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,35,656 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉండగా బుధవారం 41,962 మందికి టెస్టులు చేయగా 1504 పాజిటివ్‌లు తేలాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 288 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 15, భద్రాద్రి 83,జగిత్యాల 36, జనగాం 17, భూపాలపల్లి 11, గద్వాల 16, కామారెడ్డి 41, కరీంనగర్ 66,ఖమ్మం 84, ఆసిఫాబాద్ 3 , మహబూబ్‌నగర్ 24 , మహబూబాబాద్ 14, మంచిర్యాల 23, మెదక్ 21, మేడ్చల్ మల్కాజ్‌గిరి 118, ములుగు 15, నాగర్‌కర్నూల్ 24, నల్గొండ 93, నారాయణపేట్ 2, నిర్మల్ 14, నిజామాబాద్ 39, పెద్దపల్లి 24, సిరిసిల్లా 45, రంగారెడ్డి 115, సంగారెడ్డి 28, సిద్ధిపేట్ 73, సూర్యాపేట్ 41, వికారాబాద్ 15, వనపర్తి 23, వరంగల్ రూరల్ 21, వరంగల్ అర్బన్ లో 44, యాదాద్రిలో మరో 28 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,35,656 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,16,353కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

రెండు లక్షల 16వేలు మంది కోలుకున్నారు….

రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు ఏకంగా రెండు లక్షల 16 వేల మూడు వందల యాభై మూడు మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అంటే వైరస్ బారిన పడుతున్న వారిలో సుమారు 95 శాతం మంది సులువుగా కోలుకుంటున్నారని, కేవలం ఐదు శాతం మంది మాత్రమే రిస్క్ జోన్‌లో ఉంటున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. కానీ ఈ గ్రూప్‌కి చెందిన వారికి సకాలంలో చికిత్సను అందించడం వలనే మరణాల రేట్ మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

41 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 41 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రా్రష్ట్ర వ్యాప్తంగా 41,96,958 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఆ ఏడు జిల్లాల్లోనూ తీవ్రత తగ్గింది….

రెండు నెలల క్రితం జిహెచ్‌ఎంసితో పాటు కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండేది. కానీ ప్రస్తుతం జిహెచ్‌ఎంసితో పాటు ఈ ఏడు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి తగ్గింది. గతంలో ప్రతి రోజు ఒక్కోక్క జిల్లాలో సగటున వందకు తగ్గకుండా నమోదైన కేసులు, ప్రస్తుతం దాదాపు 50 శాతం తగ్గాయి. ఇక మిగతా జిల్లాల్లో ప్రతి రోజు గరిష్ఠంగా 20 కేసులు కంటే మించడం లేదు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రోజూ జీరో కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే కేసులు కేసులు తగ్గినప్పటికీ, శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News