Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 15,940 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

15940 Corona Positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 15,940 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర(4205), కేరళ(3981) కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు దేశంలో 4.33 కోట్ల మందికి సోకగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 4.27 కోట్ల మంది కోలుకోగా 90 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 196.94 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News