హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 44,644 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 1,607 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 6 మంది కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 937 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 1,372 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,27,583 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా… రాష్ట్రంలో ప్రస్తుతం 19,936 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్ లో 17,134 మంది బాధితులు చికిత్స పొందున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 296 మందికి వైరస్ సోకింది.
Telangana recorded 1,607 new #COVID19 cases, 937 recoveries and 6 deaths yesterday.
Total number of cases now at 2,48,891 including 2,27,583 recoveries, 1,372 deaths, and 19,936 active cases: State Health Department pic.twitter.com/jJ2WlJd622
— ANI (@ANI) November 7, 2020
1607 New Covid-19 Cases Reported in Telangana