- Advertisement -
లఖ్నో: ఉత్తర్ ప్రదేశ్లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18మంది చనిపోయారు. కౌశాంబి జిల్లాలోని కడాధామ్ ప్రాంతంలో ఇసుక లారీ, వ్యాన్ను ఢీకొన్న ఘటనలో 8మంది చనిపోగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. శ్రావస్తిలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఉన్నావోలోని లఖ్నోఆగ్రా రహదారిపై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు చనిపోయారు. జలౌన్లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తల్లీ, కొడుకు మృతి చెందారు. చిత్రకూట్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు.
- Advertisement -