- Advertisement -
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. పోలీస్ అకాడమీలో మొదట వంట మనిషికి కరోనా సోకింది. ఆ తర్వాత అకాడమీలో శిక్షణ పొందుతున్న 180 మంది అభ్యర్థులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో కరోనా సోకినవారందరినీ అకాడమీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్కు తరలించారు. అకాడమీలో సిబ్బంది, శిక్షణ పొందుతున్న వారితో కలిపి మొత్తం 2 వేలకు పైగా ఉంటున్నారు. ఇందులో 1100 మందికిపైగా ఎస్ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు.
180 Corona Cases in Telangana Police Academy
- Advertisement -