Thursday, May 2, 2024

ఎపిలో 184 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

184 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 29,731 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 కేసులు వెల్లడి కాగా, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.అదే సమయంలో 214 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,198 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,55,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,163 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,432కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News