Thursday, May 2, 2024

శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

2 Ayyappa pilgrims died in Road Accident in Kerala

తిరువనంతపురం: కేరళలోని శబరిమల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఆగి ఉన్న టెంపో వాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు ఘటనాస్థలంలోనే మరణించగా.. మరో 9మంది భక్తులు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారితోపాటు మృతి చెందిన వారిని ఎపిలోని కర్నూల్ జిల్లా, బుధవారపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయ్యప్ప స్వామి మాల వేసి వీరందరూ శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

2 Ayyappa pilgrims died in Road Accident in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News