Friday, May 3, 2024

21మంది ఎమ్‌ఎల్‌ఎలు నాతో టచ్‌లో ఉన్నారు: మిధున్ చక్రవర్తి

- Advertisement -
- Advertisement -

21 TMC MLAs are in touch with me: Mithun Chakraborty

కోల్‌కతా: పలు రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపాటుకు గురైనా కాషాయ పార్టీ కుటిల ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీఎంసీ ఎమ్‌ఎల్‌ఎలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ నేత, నటుడు మిధున్ చక్రవర్తి తాజాగా మరోసారి బాంబు పేల్చారు. కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 21మంది ఎమ్‌ఎల్‌ఎలు తనతో నేరుగా టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలోనూ తాను ఈ విషయం చెప్పానని, ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నానని, కేవలం తగిన సమయం కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

21 TMC MLAs are in touch with me: Mithun Chakraborty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News