Thursday, May 2, 2024

ఎపిలో 2,145 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2145 new Covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.మరోవైపు 2,003 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో నలుగురు, కడప, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

2145 new Covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News