Thursday, May 2, 2024

18 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు

- Advertisement -
- Advertisement -

2745 new covid cases reported in india

న్యూఢిల్లీ : బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం క్రియాశీల కేసులు 18 వేల మార్కు దాటాయి. మంగళవారం 4.55 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 2745 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.60 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 2236 మంది కోలుకున్నారు. ఆరుగురు మరణించారు. క్రియాశీల కేసులు 18,386 (0.04 శాతం) పెరిగాయి. ఇప్పటివరకు 4.31 కోట్ల మందికి కరోనాసోకగా, 4.26 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. ఇప్పటివరకు 5.24 లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరుకున్నారు. మంగళవారం 10.9 లక్షల మందికి పైగా టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు 193.57 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News