Friday, May 3, 2024

98 శాతానికి పెరిగిన రికవరీ రేటు

- Advertisement -
- Advertisement -

299 New Covid-19 cases Reported in Telangana

కొత్తగా మరో 299 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 57, జిల్లాల్లో 242 మందికి పాజిటివ్
2,91,666కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది. అంటే వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 98 మంది సులువుగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండ గా కొత్తగా 299 మందికి కొవిడ్ తేలింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 57 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 11,జగిత్యాల 8, జనగాం 2, భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 3, కరీంనగర్ 24,ఖమ్మం 10, ఆసిఫాబాద్ 1 , మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 3, మంచిర్యాల 11, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 26, ములుగు 4, నాగర్‌కర్నూల్ 2, నల్గొండ 10, నారాయణపేట్ 0, నిర్మల్ 2, నిజామాబాద్ 5, పెద్దపల్లి 9, సిరిసిల్లా 7, రంగారెడ్డి 18, సంగారెడ్డి 11, సిద్ధిపేట్ 10, సూర్యాపేట్ 7, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ లో 10, యాదాద్రిలో మరో ఐదుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,91,666కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,85,898కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ప్రతి పది లక్షల్లో 2 లక్షల మందికి టెస్టులు….

రాష్ట్రంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 74,61,687 మందికి కరోనా టెస్టులు చేశామని అధికారులు తెలిపారు. అంటే ప్రతి పది లక్షల్లో 2 లక్షల 475 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మరోవైపు ప్రతి రోజు 44 శాతం మంది ప్రైమరీ, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. అయితే ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో 2,04,166 మందికి అసింప్టమాటిక్‌తో వైరస్ సోకగా, 87,500 మందికి లక్షణాలతో పాజిటివ్ తేలినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News