Friday, March 29, 2024

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

3 Terrorist killed by security forces in Jammu Kashmir

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని శుక్రవారం ఉదయం కాశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం బుద్గాంలోని జోల్వా క్రాల్‌పోర చడూర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని, ఘటనాస్థలంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఐజిపి విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

3 Terrorist killed by security forces in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News