Thursday, May 2, 2024

జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

343 Grams Gold Seized at Jaipur Airport

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 343 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. లగేజి బ్యాగ్ వీల్స్ లో బంగారం దాచి తరలించేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

343 Grams Gold Seized at Jaipur Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News