Tuesday, April 30, 2024

తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

అత్యధికంగా 14 కేంద్రాలు హైదరాబాద్‌లోనే
మిగతా జిల్లాలో ఒకటి చొప్పన కౌంటింగ్ సెంటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవిఎంలు అధికారులు తరలించారు. ఈనెల 30న ఓట్లు ముగిసిన తరువాత లెక్కించే కేంద్రాలను కూడా సిద్దం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వీటిలో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఉన్నట్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్దం చేస్తున్నారు.

హైదరాబాద్ జిల్లాలో: ముషీరాబాద్ ఏవీ కళాశాల దోమల్ గూడ, మలక్ పేట ఇండోర్ స్టేడియం, అంబర్ పేట రెడ్డి ఉమెన్స్ కళాశాల నారాయణగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ, సనత్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ఓయూ, నాంపల్లి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ మాసబ్ ట్యాంక్, కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసబ్ ట్యాంక్, గోషామహల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కోఠి, చార్మినార్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల నాంపల్లి, చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల బషీర్ బాగ్, యాకత్ పురా సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ నాంపల్లి , బహదూర్ పురా అరోరా కళాశాల బండ్లగూడ, సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓయూ, కంటోన్మెంట్ వెస్లీ కళాశాల సికింద్రాబాద్…

రంగారెడ్డి జిల్లాలో : ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్‌ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News