Sunday, April 28, 2024

ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

6.4 Magnitude of Earthquake in Indonesia

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, జమ్ముకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెసిమాల‌జీ వెల్లడించింది.పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలతోపాటు ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, ఉత్తరాఖండ్ లలో భూమి కంపించిందని తెలిపింది. ఆఫ్గాన్ హిందూకుష్ పర్వత శ్రేణిలో భూకంప కేంద్ర ఏర్పడిందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది.

5.7 Magnitude of Earthquake in Delhi and J&K

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News