Friday, May 3, 2024

యుపిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

5 killed in road Accident in UP's Kushinagar

గోరఖ్‌పూర్(యుపి): కుషీ నగర్ జిల్లాలోని రాంకోలా-కప్తాగంజ్ రహదారిపై ఒక ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గురువారం సాయంత్రం కుషీనగర్‌లో ఒక వేడుకలో పాల్గొన్న దేవరియా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు తిరిగివస్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఒక ట్రాక్టర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. మృతులంతా 20-29 ఏళ్ల లోపు యువకులే. కారును ఢీకొన్న ట్రాక్టర్ బోల్తాపడి ధ్వంసమైనప్పటికీ అందులోని డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News