Tuesday, April 30, 2024

అమెరికాలో గ్యాస్ లీక్: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

6 dead in chemical leak at Georgia food processing plant

 

న్యూయార్క్: అమెరికాలోని జార్జియాలో మెట్రో అట్లాంటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడగా 11 మంది అస్వస్థతకు గురయ్యారు. నైట్రోజన్ వాయువు లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2019వ సంవత్సరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News