Tuesday, April 30, 2024

బాలికపై వృద్ధుడి అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బస్‌స్టాప్ కోసం ఎదురు చూస్తున్న బాలికకకు మాయమాటలు చెప్పి వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీన సంఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…ఈ నెల 3వ తేదీన ఇంటికి వెళ్లేందుకు బాలిక(16) ఉప్పల్ బస్‌స్టాప్‌లో వేచి చూస్తోంది. పాతబస్తీకి చెందిన షేక్ సాదక్(60) ఉప్పల్ ప్రాంతంలోని ఓ కట్టెల మిషన్‌లో పనిచేస్తున్నాడు. అదే సమయంలో బస్‌స్టాప్‌కు వచ్చిన సాదక్ బాలికను ఆమె బంధువుల ఇంటిలో వదిలి పెడతానని చెప్పాడు.

నిందితుడి మాటలు నమ్మిన బాలిక అతడి వెంట వెళ్లింది. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లిన నిందితుడు అత్యాచారం చేసి బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. అక్కడి నుంచి బాలిక బయటికి వచ్చి ఇంటికి చేరే వరకు చాలా ఆలస్యమైంది. అంతేకాకుండా బాలిక మౌనంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో బాలిక తనపై జరిగిన అత్యాచారం విషయం తల్లికి చెప్పింది. వెంటనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిటివిల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News