Tuesday, April 30, 2024

రెండు బస్సులు ఢీ: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 Members dead in Road accident in UP

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారబంకి జిల్లాలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోనికాత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్ర పూర్ మద్రాహా గ్రామ శివారులో ముందున్న డబుల్ డెక్కర్‌ను మరో డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో 8 మంది ఘటనా స్థలంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News