Monday, May 13, 2024

దేశంలో మరో 81,484 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

81484 new covid-19 cases 1095 deaths reported in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,484 కొత్త కోవిడ్-19 కేసులు, 1,095 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ నుంచి 53,52,078 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో 9,42,217 యాక్టివ్ కేసులున్నాయి.  99,773 మందిని కరోనా కబలించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్ లో అక్టోబర్ 1 వరకు 7,67,17,728 మంది నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 10,97,947 నమూనాలను పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

81484 new covid-19 cases 1095 deaths reported in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News