అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖను పంపించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రతిపాదన రాగానే విభజిత నవ్యాంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ అసెంబ్లీలోనూ బయట ప్రయత్నించి ఉన్నాను” అని డొక్కా తెలిపారు.
తెలుగు దేశం పార్టీ తనకు అన్ని విధములుగా తనను ప్రోత్సహించినందుకు, టిడిపి జాతీయ ప్రదాన కార్యకర్శి నారాలోకేశ్ తన పట్ల చూపిన అభిమానానికి మన:పూర్వక ధన్యవాదాలు. ”2019 ఎన్నికల అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్చయించుకున్నానని, పై కారణాల రీత్యా అమరావతి రాజధాని విడిపోతున్నందుకు నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని” ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
okka Manikya Vara Prasad resigns for MLC