హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లల కౌటింగ్ ప్రారంభంమవగా…. 2,647 మంది వార్డు మెంబర్లు,324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 10గంటల కల్లా తొలి ఫలితం ఉంచే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నాం వరకు దాదాపు ఫలితాలు వెల్లడికానున్నాయి. సాయంత్రంలోగా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు 2,169 టేబుళ్లు.. 1,370 టీమ్ లు, 3,018 మంది సూపర్ వైజర్లు, 5,876మంది అసిస్టెంట్ల నియామకం జరిగింది. ఒక్కో టేబుల్ దగ్గర ముగ్గురు లెక్కింపు సిబ్బంది. ఓట్ల లెక్కింపుకు కోసం మొత్తం 10వేల మంది సిబ్బంది ఉన్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, ఈ నెల 27న మేయర్లు చైర్ పర్సన్ల ఎన్నిక జరగనుంది.
Telangana Municipal Elections Counting started